Tuesday, May 7, 2024

అగ్నిప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Govt teacher dead in Fire accident in Rangareddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం మండలం ఎఫ్ సిఐ కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో మంటలు అంటుకోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సజీవదహనం కాగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. గాయపడిన భర్తను అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి(45)గా గుర్తించారు. సరస్వతి కుటుంబం ఉంటున్న రెండో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాద జరిగినట్టు సమాచారం.  మృతురాలి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News