Thursday, May 2, 2024

గ్రీన్‌మ్యాన్‌కు సన్మానం

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రజల్లో పర్యావరణపై అవగాహన కల్పిస్తున్న ‘గ్రీన్ మ్యాన్’ నర్పత్‌సింగ్ రాజ్ పురోహిత్‌ను తెలంగాణ అటవీశాఖ అధికారులు ఘనం సన్మానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణ, వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తూ.. 15 రాష్ట్రాలు/4 కేంద్రపాలిత ప్రాంతాల్లో సైకిల్‌పై 25097 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రయాణం చేసిన రాజ్ పురోహిత్‌ను గురువారం నగరంలో అటవీశాఖ అధికారులు అభినందించారు. రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఆయనకు అటవీశాఖ ఉన్నతాధికారులు ఆర్‌ఎం డోబియ్రాల్, ఎంసి పర్గెన్ వివరించారు. సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం జిల్లాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు రాజ్‌పురోహిత్ పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News