Monday, May 6, 2024

పెళ్లికి ముందు రోజు వరుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: పెళ్లికి ఒక రోజు ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టెబర్ల యాదమ్మ-లింగయ్య దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్ గౌడ్ కు (25) కందుకూరు మండలంలో ఓ అమ్మాయితో 4వ తేదీన పెళ్లి నిశ్చయం చేశారు. వధువు, వరుడు కుటుంబ సభ్యుల పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం వరుడి కొత్త ఇంటి దగ్గరు పెళ్లి పందిరి వేశారు. పాత ఇంట్లో నిద్రపోతున్న శ్రీకాంత్ దగ్గరికి అన్న రాజు వెళ్లి కమ్మలు కొట్టడానికి బయటకు బైక్ పై వెళ్తున్నానని చెప్పాడు. ఎవరు లేనప్పుడు ఇంట్లో శ్రీకాంత్ ఉరేసుకున్నాడు. దీంతో పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మెదక్ పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News