Friday, May 17, 2024

భార్య ఆత్మహత్య…. ఎస్ఐ భవనం పైనుంచి దూకి…

- Advertisement -
- Advertisement -

Young Man Died With Electrocution In Kamareddy

చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరు మండలంలో పాముత్తపట్టి గ్రామంలో భార్య మృతిని తట్టుకోలేక ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పురుషోత్తమన్(58), సుజాత(48) అనే దంపతులు పాముత్తపట్టి గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. క్రిష్ణగిరి జిల్లా బర్గూర్‌లోని పోలీస్ స్టేషన్‌లో పురుషోత్తమన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి సుజాతతో చిన్న తనయుడు దీపక్ గొడవపడ్డాడు. మనస్థాపం చెందిన సుజాత ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. భార్య సొంతూరు పాముత్తపట్టిలో అంత్యక్రియలు నిర్వహించాలని పురుషోత్తమన్ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News