సిడ్నీ: పరిమిత ఓవర్ల సిరీస్లో అద్భుత ఆటను కనబరిచిన యువ ఆటగాడు హార్దిక్ పాండ్య టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండడం లేదు. అతనికి టెస్టు జట్టులో చోటు దక్కక పోవడంతో స్వదేశానికి బయలుదేరి వెళ్లాలని హార్దిక్ నిర్ణయించాడు. ఒక దశలో జట్టు యాజమాన్యం కోరితే టెస్టుల్లో ఆడేందుకు తనకు అభ్యంతరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హార్దిక్ తాజా ప్రకటనలో టెస్టుల్లో ఆడడం లేదని వివరించాడు. తాను భారత్కు వెళ్లిపోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుటుంబ సభ్యులతో గడపాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనకు టెస్టుల్లో ఆడాలనే ఉద్దేశం లేదన్నాడు. ఇటీవలే తండ్రి అయిన తాను కుటుంబ సభ్యులతో గడిపాలని నిర్ణయించానని వివరించాడు. ఇదిలావుండగా హార్దిక్ ట్వంటీ20 సిరీస్లో అద్భుత ఆటను కనబరిచి ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.