Tuesday, April 30, 2024

ఆ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండం అవుతుంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు తెలిపారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ బిఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్ రావు ప్రసంగించారు. విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డితోనే కడియం శ్రీహరి కండువా కప్పించుకున్నారని, ఇంతగా దిగజారడం అవసరమా అని కడియంకు చురకలంటించారు.

కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువ అని కడియం శ్రీహరే అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం లేకపోయినంత మాత్రానా అధైర్య పడాల్సిన అవసరం లేదని, వరంగల్ జిల్లా ఉద్యమాల జిల్లా అని, ఇక్కడి కార్యకర్తలు భయపడరని, ఒక్క వరంగల్ జిల్లాకు కెసిఆర్ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చిందన్నారు. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని హరీశ్ రావు హెచ్చరించారు. ఉద్దర మాటలు తప్పితే కాంగ్రెస్ ఉద్ధరించిందేమీ లేదని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, ఇప్పటి వరకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News