Tuesday, April 30, 2024

రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తిన హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉచిత కరెంట్‌పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కెసిఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని నిప్పులు చెరిగారు.

నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడాని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగలేదని వ్యాఖ్యానించారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలని పేర్కొన్నారు. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలని హరీశ్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని, ధరణి వద్దు…రైతుబంధు వద్దు…ఉచిత కరెంట్ వద్దు కాంగ్రెస్ అంటోందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News