Friday, April 26, 2024

పాక్ జట్టు గెలిస్తే సంతోషించేవారు భారతీయులు కాదు

- Advertisement -
- Advertisement -
Haryana minister Anil Vij tweet on India-Pak match
హర్యానా మంత్రి వ్యాఖ్యలు

చండీగఢ్: భారత్‌పై పాకిస్తాన్ జట్టు క్రికెట్ మ్యాచ్‌లో గెలిస్తే టపాసులు కాల్చేవారి డిఎన్‌ఎ భారతీయులది కాదని హర్యానా ఆరోగ్య మంత్రి అనీల్ విజ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మాతృభూమిలోనే పొంచి ఉన్న విద్రోహులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన హిందీలో మంగళవారం ట్వీట్ చేశారు. గత ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసిసి టి 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత జట్టుపై పాకిస్తాన్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల కశ్మీరులో కొందరు సంబరాలు జరుపుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అనీల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News