Monday, May 13, 2024

చేవెళ్ల మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మండలంలోని మీర్జాగూడ గేటు వద్ద ఓ భారీ మర్రి చెట్టు రోడ్డు అడ్డంగా పడిపోయింది. దీంతో బీజాపూర్ రహదారిపై అరగంట నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అటు చెన్విల్లి హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం కూలింది. చన్వెల్లిలో రైతులకు చెందిన పాలీహౌస్ కూలిపోయాయి. పాలీహౌస్ లో కూరగాయలు, పూలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News