- Advertisement -
హైదారబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అప్పపీడనం కారణంగా తెలుగురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరంలో 40-50 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అయితే ఎపి, తెలంగాణలో నాలుగు రోజులపాటు విస్తారంగా వానలుపడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా గత రెండు రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరభారతం అతలాకుతలం అవుతోంది.
Heavy rains forecast for the Telugu States
- Advertisement -