Tuesday, April 30, 2024

అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

నల్గొండ:నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టి న బదిలీలలో భాగంగా సూర్యా పేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను కొమరం భీం అసిఫా బాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ చేసిన ప్రభుత్వం తిరిగి నల్గొండ జి ల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ చేసింది.

ఈ సందర్భంగా శనివారం అయన జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News