Sunday, April 28, 2024

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు..

- Advertisement -
- Advertisement -

Hero Nagarjuna visit Tirumala Temple

తిరుమల: అక్కినేని కింగ్ నాగార్జున తిరుమల తిరుమతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భార్య అక్కినేని అమలతో కలిసి తిరుమల చేరుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో నాగార్జున దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత వీరిని ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కాగా, నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఘన విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబడుతూ దూసుకుపోతోంది.

Hero Nagarjuna visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News