Thursday, May 16, 2024

కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలు తొలగించి, తిరిగి మూల్యాంకనం చేయాలని టిఎస్‌ఎల్‌పిఆర్‌బిని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయక పోవడాన్ని తప్పుబట్టిన కోర్టు మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. కాగా, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైనల్ ఫలితాలను అక్టోబరు 4న టిఎస్‌ఎల్‌పిఆర్‌బి విడుదల చేసిన సంగతి విదితమే. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News