Tuesday, April 30, 2024

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డికి హై కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరవేసి చిత్రీకరించిన కేసులో రేవంత్‌రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రేవంత్‌రెడ్డికి చర్లపల్లి జైల్లో 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీనిపై కూకట్ పల్లి కోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. అనంతరం తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. బుధవారం విచారించిన న్యాయస్థానం రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

High Court granted bail to MP Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News