Wednesday, May 1, 2024

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఎంఎల్‌ఎ జోగి రమేష్‌ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. దీంతో టిడిపి-వైసిపి కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. బుద్దా వెంకన్న-జోగి రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో బుద్ధా వెంకన్న కిందపడిపోయాడు. రాళ్ల దాడిలో జోగి రమేష్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘర్షణలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పే వరకు వెనక్కి వెళ్లేది లేదని జోగి భీష్మించుకొని కూర్చున్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ అయ్యన్న చేసిన వాఖ్యలపై జోగి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News