Tuesday, April 30, 2024

హిమాచల్‌లో నవంబర్ 12న ఓటింగ్…డిసెంబర్ 8న ఫలితాలు

- Advertisement -
- Advertisement -
Rajiv Kumar
గుజరాత్‌కు ఎన్నిక తేదీలు ప్రకటించలేదు 

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే దఫాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. హిమాచల్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8, 2022న ప్రకటించబడతాయి.  నామినేషన్ల దాఖలు అక్టోబర్ 17న ప్రారంభమై అక్టోబర్ 25 వరకు కొనసాగుతుంది. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించలేదు.

హిమాచల్‌లో 55 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.  వారిలో 1.86 లక్షల మంది మొదటిసారి ఓటర్లు, 1.22 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన వారేనని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 7,881 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి, ఇందులో 142 పూర్తిగా మహిళలు,  37 మంది వికలాంగులు నిర్వహిస్తున్నారు. “ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండాలి. ఓటింగ్ అనుభవం సౌకర్యవంతంగా, అవాంతరాలు లేకుండా ఉండాలి” అని రాజీవ్ కుమార్ అన్నారు.

ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే సెప్టెంబర్‌లో గుజరాత్, హిమాచల్‌లలో పర్యటించారు. గుజరాత్‌లో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, జాతీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News