- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇటీవలే కరోనాతో అమిత్ షా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తాజాగా వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ వచ్చిందని బిజిపి నాయకులు మనోజ్ తివారీ తెలిపారు. గత వారం రోజులుగా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో అమిత్ షా చికిత్స పొందారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఇదే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. షా తనకు పాజిటివ్ అని తేలిన వెంటనే తనను కలిసినవారు ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. ఈ కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Home Minister Amit Shah tests negative for COVID 19
- Advertisement -