Monday, April 29, 2024

అల్లుడిని కత్తితో నరికి చంపిన మామ

- Advertisement -
- Advertisement -

Uncle killed son in law at East Godavari

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రౌతలపూడి మండలం డి.జె.పురంలో ఆదివారం దారుణం జరిగింది. అల్లుడిని మామ కత్తితో నరికి హత్య చేశాడు. నరికిన అల్లుడి తలతో ఆయన పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఏడాది క్రితం కూతురు చావుకు అల్లుడే కారణమంటూ హత్య చేసినట్టు నిందితుడు చెబుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Uncle killed son in law at East Godavari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News