Sunday, April 28, 2024

ఈనెల 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Tirumala Srivari TempleHuge devotees visit Tirumala Srivari Temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 25,052 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 11,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.54 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ రోజు విఐపి దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

Huge devotees visit Tirumala Srivari Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News