Tuesday, May 14, 2024

తిరుమలలో భక్తుల కోలాహలం

- Advertisement -
- Advertisement -

Huge devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న సెలవు రోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న 29,821 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 11,787మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.66 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో స్వామివారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయడంతో ఆఫ్ లైన్ టోకెన్ల విడుదలను నిలిపివేశామని టిటిడి అధికారులు తెలిపారు. రోజుకు 8వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

Huge devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News