Sunday, May 5, 2024

శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 69,804 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, స్వామివారికి 29,615 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈరోజు(సోమవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News