Tuesday, April 30, 2024

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి.. నాలుగు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.మంగళవారం ప్రాజెక్టులోకి 29,800 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిజాం సాగర్ జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 1405 అడుగుల కాగా, ప్రస్తుత నీటిమట్టం 1403.7 అడుగులు ఉంది. ఇక, నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News