- Advertisement -
అమరావతి: భార్య గొంతుకోసి చంపే ప్రయత్నం చేసిన భర్తను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒడిశా రాష్ట్రానికి చెందిన రీటా-గనూన్ అనే దంపతులు జీవనోపాధి కోసం గుంటూరుకు వచ్చారు. గనూన్ స్థానికంగా ఉండే స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఇద్దరు మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన గనూన్ తన భార్య రీటా గొంతు కోశాడు. చంపేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గనూన్ పట్టుకొని దేహశుద్ధి చేశారు. 108లో బాధితురాలని చిలకలూరి పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -