Monday, May 13, 2024

అనుమానం… భార్యను చంపి… అడవిలోకి వెళ్లి..

- Advertisement -
- Advertisement -

cylinder-explosion

బెంగళూరు: భార్యపై అనుమానంతో ఆమెను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం ఆడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆడుగోడిలోని రాజేంద్రనగర్‌లో నిషార్-అయేషా అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యపై అనుమానం పెంచుకుని పలుమార్లు గొడవపడ్డాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 19 రాత్రి ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు సిలిండర్ ఆన్ చేసి పెట్రోల్ చల్లి పేలిపోయేలా చేశాడు. దీంతో సిలిండర్ పేలిన ఘటనలో చనిపోయిందని నమ్మించాడు. సిలిండర్ పేలిన అప్పటి నుంచి నిషార్ కోసం పోలీసులు గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో అతడి సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేయగా అటవీ ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News