Sunday, April 28, 2024

ప్రేమ పెళ్లి… భార్యను చంపి… కరోనాతో..

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Tirupathi
అమరావతి: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు… దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో కన్న కూతురు ఎదుటే భార్యను భర్త చంపి కాల్చేశాడు. అనంతరం కరోనాతో చనిపోయిందని ఆమె పుట్టింటి వారిని నమ్మించాడు. ఇంట్లో ఉన్నప సిసి టివి ఫుటేజీ నిందితుడిని పట్టించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కడపకు చెందిన శ్రీకాంత్ రెడ్డి(30), భువనేశ్వరిని(27) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక సంవత్సరం వయసు ఉన్న పాప ఉంది. గత కొన్ని రోజుల  నుంచి దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. భువనేశ్వరి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమెకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో తిరుపతిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు రూమ్ తీసుకొని ఉంటున్నారు. జూన్ 22 నుంచి భువనేశ్వరి తన పుట్టింటికి వారికి ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని అడిగారు. భువనేశ్వరికి కరోనా రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామని. డెల్టా వేరియంట్ కావడంతో చికిత్స పొందుతూ చనిపోయిందని మృతదేహానికి అక్కడే దహనసంస్కారాలు చేశారని భువనేశ్వరి కుటుంబ సభ్యులను నమ్మించాడు.

భువనేశ్వరి అక్క కూతురు మమత కర్నూలు జిల్లాలో ట్రైనీ ఎస్‌ఐగా పని చేస్తోంది. తిరుపతిలోని సదరు అపార్ట్‌మెంట్ సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించాని స్థానిక పోలీసులను కోరారు. సిసి ఫుటేజీని పరిశీలించగా… ఈ జూన్ 22న శ్రీకాంత్ పెద్ద సూట్ కేసులో ఇంట్లోకి పోయాడు. అదే సూట్‌కేసుతో ట్యాక్సీలో బయటకు వెళ్లినట్టు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా రుయా ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో కారు నుంచి సూట్‌కేసును దించినట్టు గుర్తించారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా సూట్‌కేసులో కాలిపోయిన మృతదేహం కనిపించింది. వెంటనే ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News