Friday, April 26, 2024

భారత్ @ 37,566 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

24712 New Corona Cases Registered in India

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. వంద రోజుల తరువాత 40 వేల లోపు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 907 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.03 కోట్లకు చేరుకోగా 3.97 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.93 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 5.52 లక్షల మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శర వేగంగా అందరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. 32.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 40.6 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News