Sunday, April 28, 2024

టిక్‌టాక్ మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిక్‌టాక్ మోజులోపడి భార్య భర్తను పట్టించుకోకకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫతేనగర్‌లో నివాసం ఉంటున్న దంపతులు పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్‌కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రియాంక సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేది. అది రాను రాను ఎక్కువై టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్ టాక్‌లో ప్రియాంక నీమ్కార్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కావడంతో చాలా సమయంలో టిక్‌టాక్‌పై వెచ్చించేది, భర్తను పట్టించుకునేది కాదు.

ఇది గమనించిన భరత్త ఆమెను పలుమార్లు మందిలించాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. ఇంత జరిగినా ప్రియాంక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్ ఆదివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డిసిపి పద్మకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సనత్‌నగర్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Husband suicide for wife makes videos on TikTok

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News