- Advertisement -
మనతెలంగాణ/కార్వాన్ : భార్యపై అనుమానంతో రోకలి బండతో తలపై బాది భర్త హత్య చేసిన సంఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేష న్ పరిధిలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన శ్రీనివాస్ (45) పెయింటర్గా పనిచేస్తూ భార్య మంగలమ్మ (40), కొడుకు, కూతురుతో కలిసి మార్కండేయ నగర్లో అద్దెకు ఉంటున్నాడు. ఇళ్లలో పాచి పనిచేసే భార్యపై అనుమానంతో తరుచూ శ్రీనివాస్, మంగమ్మతో గొడవ పడుతుంటాడు. తాజాగా మంగళవారం రాత్రి కూడా భార్యతో గొడవ పడ్డ శ్రీనివాస్ బుధవారం ఉదయం తలపై రోకలి బండతో బాది పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న తల్లిని చికిత్స నిమిత్తం కూతురు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. పోలీసులు శ్రీనివాస్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -