Friday, April 26, 2024

‘మహా సముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది

- Advertisement -
- Advertisement -

Maha samudram movie becomes blockbuster

 

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిద్దార్థ్, అజయ్ భూపతి, అదితిరావు హైదరి, అనిల్ సుంకర పాల్గొన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఫస్ట్ వేవ్ (ఫస్ట్ ట్రైలర్) చూశారు. సెకండ్ వేవ్ చూశారు. ఇక గురువారం చూడబోయేది ఉప్పెన అని అనుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ మీద అజయ్ భూపతితో పాటు మా అందరికీ నమ్మకం ఉంది. కోవిడ్ తరువాత అత్యంత భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి”అని అన్నారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. “ఈ సినిమా స్టోరీ, క్యారెక్టరైజేషన్స్ వచ్చే జనరేషన్స్ ఒక కొలమానంగా తీసుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్‌కి స్టార్ట్ ఉంది ఎండ్ ఉంది. అన్ని కథల్లో అది కుదరదు. ఈ సినిమాలో మహా క్యారెక్టర్ బరువున్న క్యారెక్టర్. అందుకే అనుభవమున్న హీరోయిన్ కావాలి. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఈ పాత్రకు అదితి ఓకే చెప్పింది. మా సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News