Sunday, May 5, 2024

భారీగా ప్రవహిస్తున్న వరద.. హుస్సేన్ సాగర్ గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీగా వరద ప్రవహిస్తుండడంతో హుస్సేన్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. నిన్న(సోమవారం) రాత్రి కురిసిన కుండపోత నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మరోవైపు, భారీ వరద నీరు హుస్సేన్ సాగర్ లో రావడంతో నిండు కుండలా మారింది.

ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ అన్నీ ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. కాగా, మరో 2 రోజులపాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News