- Advertisement -
హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్ బంజారాహిల్స్ గ్రీన్ వ్యాలీ పార్కులో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగరంలోని పార్కుల్లో వారంపాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని హరితవనంగా మార్చుతున్నామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం 900 పార్కులు ఉన్నాయని చెప్పారు. నిరూపయోగంగా ఉన్న పార్కులకు పూర్వవైభవం తెస్తామని మేయర్ తెలిపారు. అన్ని వయస్సుల ప్రజలకు ఉపయోగపడేవిధంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్లతోపాటు జిమ్లు, ఇతర వసతులు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ లో కొత్తగా 320 పార్కులు, 50 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్న బొంతు రామ్మోహన్ నగరంలో శిధిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
Hyderabad mayor initiated the sanitation program
- Advertisement -