న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో మంగళవారం జరిగిన హింసాకాండ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)కు చెందిన ఒక అధికారి హత్యకు గురయ్యారు. 26 ఏళ్ల అంకిత్ శర్మ అనే ఆ ఐబి అధికారి మృతదేహం బుధవారం చాంద్ బాగ్లో ఒక మురుగు కాల్వలో బయటపడింది. ఐబిలో సెక్యురిటీ అసిస్టెంట్గా శర్మ పనిచేస్తున్నట్లు ఆయన సోదరుడు అంకుర్ చెప్పారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆఫీసు నుంచి తిరిగివచ్చిన అంకిత్ శర్మ తమ వాడలో జరుగుతున్న సంఘటనలు తెలుసుకోవడానికి బయటకు వెళ్లారని, సిఎఎని వ్యతిరేకిస్తున్న మూకలు ఆయనను పట్టుకున్నాయని అంకుర్ చెప్పారు. అంకిత్ను కత్తితో పొడిచి శవాన్ని మురుగుకాల్వలో పడేశారని, అంకిత్ను కాపాడేందుకు వెళ్లిన ఆయన మిత్రులను కూడా ఆందోళనకారులు పట్టుకున్నారని అంకుర్ వివరించారు. ఆందోళనకారులు తమ వద్ద ఉన్న తుపాకులతో నిర్విరామంగా కాల్పులు జరిపారని, ఎవరినీ దగ్గరకు రానివ్వలేదని ఆయన చెప్పారు. అంకిత్ శర్మ తండ్రి దేవేంద్ర శర్మ ఢిల్లీ పోలీసు శాఖలో ఎఎస్ఐగా పనిచేస్తున్నారు.