Tuesday, May 7, 2024

ఐఐటి హైదరాబాద్‌ విద్యార్థి మిస్సింగ్ విషాదాంతం..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఐఐటి హైదరాబాద్‌ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఈనెల 17న ఐఐటి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి క్యాంపస్‌కు చేరుకోలేదు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తాండాకు చెందిన సంగారెడ్డి కార్తీక్ ఐఐటిలో చదువుతున్నాడు. 18న కార్తీక్‌కు తల్దిండ్రులు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో 19న కార్తీక్ తల్లిదండ్రులు ఐఐటి క్యాంపస్‌కు వచ్చారు. కార్తీక్ క్యాంపస్‌లో లేక పోవడంతో ఆందోళనకు గురైన తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖ పట్నం వెళ్లినట్లు గుర్తించి తల్లిందుండ్రలతో కలిసి సంగారెడ్డి రూరల్ పోలీసులు విశాఖ పట్నం వెళ్లారు. అయితే, కార్తిక్ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకుని విశాఖ కెజిహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News