Friday, May 3, 2024

మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు

- Advertisement -
- Advertisement -

Implement strict lockdown in Telangana

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్ ఆదేశాలతో మరింత పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన విలేకరితో మాట్లాడుతూ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు రాకూడదని డిజిపి విజ్ఞప్తి చేశారు. “నివాసితులు తమ ఇళ్ళ నుండి అత్యవసర, వైద్య అవసరాల కోసం మాత్రమే బయటకు రావచ్చు” అని ఆయన చెప్పారు. అనవసరమైన వస్తువులను రవాణా చేసే వాహనాలను మరుసటి రోజు రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ తర్వాతే అప్పగిస్తామని డిజిపి తేల్చిచేప్పారు.

 

Implement strict lockdown in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News