Monday, April 29, 2024

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi wrote to PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ముకోర్మైకోసిస్ “బ్లాక్ ఫంగస్” కేసులు పెరుగుతున్న తరుణంలో, కోవిడ్‌లో కనుగొనబడిన ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి అవసరమైన ఔషధమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిన్-బి సరఫరాపై తక్షణ చర్యలు తీసుకోవాలని సోనియా, మోడీని కోరారు.  “మ్యూకోమైకోసిస్ చికిత్సకు లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి ఖచ్చితంగా అవసరం అని నేను అర్థం చేసుకున్నాను. అయితే, మార్కెట్లో దాని తీవ్రమైన కొరత ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను”అని గాంధీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ ఔషధాల  కొరతపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు. బ్లాక్ ఫంగస్ కు ఆయుష్మాన్ భారత్,ఇతర బీమాలకు వర్తింపజేయాలని సోనియాగాంధీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News