Friday, May 3, 2024

182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు కీలకమైన ఏడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రాలే(76) ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు.మిగతా బ్యాట్స్ మెన్స్ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు.  ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 43 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

అంతకుముదు ఓవర్ నైట్ 336/6తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో అండర్సన్, బషీర్, రేహాన్ అహ్మద్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News