Friday, May 3, 2024

రోహిత్ శర్మ ఔట్.. సెంచరీ దిశగా జడేజా

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. దీంతో 237 పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. గురువారం సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి భారత్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10)తోపాటు రజత్ పాటీదర్(05), శుభమన్ గిల్(0)లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరడంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రవీంద్ర జడేజాతో కలిసి మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు.

ఈ క్రమంలో రోహిత్.. టెస్టుల్లో 11వ శతకాన్ని పూర్తి చేశాడు. జడేజా కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అయితే దూకుడు ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్(131).. మార్క్ హుడ్ బౌలింగ్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(89, సర్ఫరాజ్ ఖాన్(5)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News