Saturday, May 4, 2024

జులైలో ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే, టి20 సిరీస్..

- Advertisement -
- Advertisement -

IND vs ENG T20 and ODI Series to held on 2022 July

లండన్: ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జులైలో మరోసారి అక్కడ పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో మూడు టి20 మ్యాచ్‌లు అడనుంది. 2022లో ఇంగ్లండ్‌లో ఇంటర్నేషనల్ క్యాలెండర్‌ను ప్రకటించిన అక్కడి క్రికెట్ బోర్డు.. టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. నిజానికి ప్రతి టూర్‌లోను టెస్టులతో పాటు వన్డే, టి20సిరీస్ కూడా జరగాల్సి ఉన్నా, ఈ సారి కరోనా కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తర్వాత నిర్వహిస్తున్నారు. వచ్చే జులై 1న ఓల్డ్ ట్రాఫర్డ్‌లో టి20 మ్యాచ్‌తో ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జులై 3న ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో రెండో టి20, జులై6న ఎజిఎస్ బౌల్‌లో మూడో టి20 జరుగుతుంది. ఇక, జులై 9న ఎడ్గ్‌బాస్టన్‌లో తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత జులై 12న ఓవల్‌లో రెండు, జులై 14న లార్డ్‌లో మూడో వన్డే జరగనుంది.

IND vs ENG T20 and ODI Series to held on 2022 July

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News