Sunday, April 28, 2024

భారత్ లక్ష్యం 311

- Advertisement -
- Advertisement -

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్ షాయ్ హోప్ (115: 135 బంతుల్లో, 8×4, 6×3) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు మూడు వికెట్లు దక్కాయి. భారత్ విజయానికి 50 ఓవర్లలో 312 పరుగులు కావాలి. కెరీర్ వందో వన్డేలో షాయ్ హోప్ సాధించడం విశేషం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు కైల్ మేయర్, షాయ్ హోప్ మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ వేగంగా ఆడాడు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో దీపక్ హుడా వెస్టిండీస్‌ను దెబ్బ తీశాడు.

IND vs WI 2nd ODI: WI sets up Target 311 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News