Sunday, April 28, 2024

పంత్ హాఫ్ సెంచ‌రీ.. టీమిండియా 329 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

India all out for 329 in first innings

చెన్నై: చెన్నై చెపాక్ వేదిక‌గా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 300 ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా కొద్ది సేప‌టికే అక్ష‌ర్ ప‌టేల్ (5) వికెట్‌ కోల్పోయింది. అనంతరం రెండు బాల్స్ ఆడిన ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. వికెట్లు పడుతున్న పంత్(58 నాటౌట్) ధాటిగా ఆడుతూ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కుల్‌దీప్ యాదవ్‌(0), సిరాజ్‌( 4)లు వెంట‌వెంట‌నే ఔట్ అవ్వడంతో టీమిండియా 329 పరుగులకు ఆలౌటైంది. రెండో టెస్టులో ముందురోజు రోహిత్ శర్మ(161), అజింక్యా రహానె(67)ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. రెండో టెస్టులో మొయిన్ అలీ (4), స్టోన్(3), లీచ్ (2), రూట్(01) వికెట్లు తీశారు. ఓవర్ నైట్ స్కోర్ కు భారత్ 29 పరుగులను జోడించింది. ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అరగంటలోనే 4 వికెట్లు కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News