- Advertisement -
ఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మూడు రాష్ట్రాలలో దాదాపులో రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదువుతన్నాయి. భారత్లో గత 24 గంటల్లో 43,082 కేసులు నమోదుకాగా 492 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 93.09 లక్షలకు చేరుకోగా 1.35 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 87.18 లక్షల మంది కోలుకోగా 4.55 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 11.31 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 13.7 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -