- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత 15 రోజుల నుంచి 50 వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 44,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 512 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 86.36 లక్షలకు చేరుకోగా 1.27 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 80.13 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 4.94 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12.07 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -