Friday, April 26, 2024

ప్రియురాలి చేతిలో ప్రియుడి కిడ్నాప్ యత్నం…. తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియురాలు ప్రియుడ్ని కిడ్నాప్ చేస్తుండగా తనయుడిని కాపాడేందుకు వెళ్లి తండ్రి ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వంశీ కృష్ణ (24) అనే వ్యక్తి తగరపువలసలో చికెన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వంశీ ఇంటి నుంచి షాపుకు వెళ్తుండగా నలుగురితో కలిసి ప్రియురాలు (35) అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. కూతవేటు దూరంలో ఉన్న వంశీ తండ్రి వెంకట్ రావు అక్కడికి చేరుకొని తన కుమారుడిని కిడ్నాప్ చేయకుండా ప్రతిఘటించాడు. పెనుగులాటలో వంశీ తండ్రి కుప్పకూలిపోయాడు. తండ్రిని వంశీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని తెలిపారు. సదరు మహిళ నలుగురితో కలిసి పారిపోయింది. ఎసిపి రవి శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాడు. గతంలో వంశీకి సదరు మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సదరు మహిళ తన భర్తను వదిలేసి వంశీతో సహజీవనం చేసింది. ఆమెను వదిలించుకునేందుకు వంశీ తండ్రి వెంకట్ రావు ఆమెకు రెండు లక్షల రూపాయలు చెల్లించి పత్రాలు రాయించుకున్నారని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News