Friday, April 26, 2024

దీనికోసం ప్రపంచం దీర్ఘకాలమే వేచి చూసింది

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఈజిప్టులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సులు పర్యావరణ మార్పుల కారణంగా తలెత్తే విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదరడం చరిత్రాత్మకంగా భారత్ అభివర్ణించింది. ‘ దీనికోసం ప్రపంచం దీర్ఘకాలం వేచి చూసింది’ అని వ్యాఖ్యానించింది. ‘కాప్ 27’ సదస్సు ముగింపు ప్లీనరీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ జోక్యం చేసుకుంటూ అయితే కర్బన ఉద్గారాలు, గ్రీన్‌హౌస్ వాయువుల తగ్గింపు బాధ్యతల భారం రైతులపై పడకుండా చూడాలని అన్నారు.

ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరేలా నిర్విరామంగా కృషి చేసిన మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం’ అని యాదవ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఈజిప్టు అధ్యక్షుడినుద్దేశించి అన్నారు. సదస్సులో వ్యవసాయం, ఆహార భద్రత రంగాల్లో వాతావరణ కార్యాచరణపై నాలుగేళ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మంత్రి ప్రస్తావిస్తూ పర్యావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది సన్నకారు రైతుల జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందువల్ల ఈ సమస్యను ఎదుర్కొనే భారాన్ని వారిపైపడకుండా చూడాలని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News