Friday, May 10, 2024

దేశంలో కొత్తగా 10వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

201 new corona cases in telangana

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,423 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 243 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237 కోట్లకు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,58,880మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 15,021మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,36,83,581కోట్ల బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,776 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 106.79కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.

India Reports 10423 new Corona Cases in 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News