- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా రోజువారి కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో గత 24 గంటల్లో 11,850మందికి కరోనా పాజిటివ్గా తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 555మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.44కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,63,245 మంది మహమ్మారికి బలయ్యారు.గడిచిన 24 గంటల్లో 12,403మంది కరోనా నుంచి కోలుకోగా, దేశంలో ఇప్పటివరకు 3.38కోట్లకు పైగా మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,36,308 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 111 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
India Reports 11850 New Cases in 24 hours
- Advertisement -