- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నం జిల్లా పాడేరు మండలం వంతాడపల్లిలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవ వధువు దుర్మరణం చెందగా వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నవ వధువు హేమ(24), తన భర్త తరుణ్ కుమార్తో (30) కలిసి బంధువుల ఇంటికి బైక్పై వెళ్తున్నారు. వంతాడపల్లి చెక్పోస్టు వద్ద వారి బైక్ను కారు ఢీకొట్టడంతో ఎగిరిపడ్డారు. ప్రమాదం స్థలంలోనే హేమ మృతి చెందగా అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని పాడేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆగస్టులో ఈ జంటకు వివాహం జరిగినట్టు సమాచారం.
- Advertisement -