Tuesday, May 7, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 13091 New Corona Cases in 24 hours

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా రోజువారి కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 13,091మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 340మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.44కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,62,189 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 13,878 మంది కరోనా నుంచి కోలుకోగా, దేశంలో ఇప్పటివరకు 3,38,00,925 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 1,38,556 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 109 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

India Reports 13091 New Corona Cases in 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News