Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 1549 new Covid-19 cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు పదిహేను వందలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,549 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 31మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.30కోట్లుకు చెరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 2,652 మంది కోలుకోగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,16,510మంది బాధితులు మరణించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 181 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 1549 new Covid-19 cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News