Tuesday, May 7, 2024

కోహ్లీ, రహానే ఔట్… ఇండియా 115/4

- Advertisement -
- Advertisement -

నాంటింగ్‌హామ్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 45 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 115 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ 36 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో మైదానం వీడాడు. భారత జట్టు 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఛటేశ్వర పూజారా నాలుగు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెనువెంటనే విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే డకౌట్ రూపంలో ఔటయ్యాడు. అజింక్య రహానే కూడా ఐదు పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(52), రిషబ్ పంత్ (03) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ రెండు వికెట్లు తీయగా రాబిన్ సన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News